News

ఆటగాళ్ల బ్యాటింగ్‌ను తప్పుపట్టిన ధోనీ


టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ న్యూజిలాండ్‌పై సెకండ్ వన్డే మ్యాచ్ ఫలితంపై స్పందించాడు. ఆటగాళ్ల బ్యాటింగ్‌ను ధోనీ తప్పుపట్టాడు. ఎవరు కూడా సరిగా ఆడలేదని, కనీసం ఒక్కరైనా మరో పావుగంట పాటు క్రీజ్‌లో నిలబడగలిగి ఉంటే మ్యాచ్ గెలిచుండేవాళ్లమని అన్నాడు. అయితే ఒక పక్క భాగస్వామ్యం అవసరమైనప్పుడు వికెట్లు కోల్పోవడం సరికాదన్నాడు. ఒక్క బ్యాట్స్‌మెన్ అయినా తాము సరిగా ఆడామని చెప్పగలరా అని కూడా ధోనీ ప్రశ్నించాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓడిపోయాన సంగతి తెలిసిందే. దీంతో 5 వన్డేల సిరీస్‌ 1-1తో సమం అయ్యింది.